ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘మంజూరైన బ్రిడ్జీలను ఆపిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదే...’

ABN, First Publish Date - 2020-12-07T04:36:45+05:30

రాష్ట్రంలో గతంలో మంజూరైన బ్రిడ్జీలను ఆపిన ఘనత వైసీపీ ప్రభుత్వానికి దక్కుతుందని మాజీ ఎమ్మెల్సీ రాజంపేట నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల చెంగల్‌రాయులు ఆరోపించారు.

దెబ్బతిన్న వంతెన వద్ద బత్యాల
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిట్వేలి, డిసెంబరు6 : రాష్ట్రంలో గతంలో మంజూరైన బ్రిడ్జీలను ఆపిన ఘనత వైసీపీ ప్రభుత్వానికి దక్కుతుందని మాజీ ఎమ్మెల్సీ రాజంపేట నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల చెంగల్‌రాయులు ఆరోపించారు. ఆదివారం మండల పరిధిలోని మైనపల్లె పంచాయతీ కొండ్లోపల్లె - రాచపల్లె కొట్టుకుపోయిన వంతెనను మండల టీడీపీ సీనియర్‌ నాయకులు బాలు రామాంజనేయులు, లారీ సుబ్బరాయుడుతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో తెలుగుదేశం హయాంలో బ్రిడ్జీకి 2,15కోట్ల రూపాయలు మంజూరైందన్నారు. అయితే జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఐదు నెలల్లో బ్రిడ్జీని ఆపిన ఘనత వైసీపీ ప్రభుత్వానికే దక్కుతుందని ఆయన ఆరోపించారు.  ఈ కార్యక్రమంలో రాచపల్లె గ్రామప్రజలు, కొత్తపల్లె గ్రామ ప్రజలు, టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. 


Updated Date - 2020-12-07T04:36:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising