ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందాలి : చీఫ్ విప్
ABN, First Publish Date - 2020-06-02T10:57:52+05:30
ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేటట్లు చూడాలని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.
లక్కిరెడ్డిపల్లె, జూన్ 1: ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేటట్లు చూడాలని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. సోమవారం స్థానిక ఎంపీడీవో సభాభవనంలో మండల అధికారులు, గ్రామ సచివాలయాల ఉద్యోగుల సమావేశంలో మాట్లాడుతూ ప్రజా సమస్యలను ఎప్పటికప్పడు పరిష్కరించాలన్నారు. వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలని దీనికోసం ప్రత్యేక నిధులు కేటాయించామన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గడికోట మోహన్రెడ్డి, మజీ జడ్పీటీసీ సభ్యుడు సుదర్శన్రెడ్డి, ఎంపీడీవో విజయరాఘవరెడ్డి, తహసీల్దార్ నజీర్అహ్మద్, మాజీ ఎంపీపీ రెడ్డెయ్య, సింగిల్విండో అధ్యక్షుడు సుబ్బారెడ్డి, ఎర్రంరెడ్డి, రవిరాజు, విజయభాస్కర్, అన్నిశాఖల అధికారులు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు.
ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్గా శ్రీకాంత్ రెడ్డి
లక్కిరెడ్డిపల్లె కమ్యూనిటీ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్గా ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈయనతో పాటు కమిటీ సభ్యులు విజయభాస్కర్, మరికొంతమంది ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆసుపత్రి అభివృద్ధిని అన్ని విధాల అభివృద్ధి చేస్తామన్నారు. కార్యక్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ డేవిడ్కుమార్, డాక్టర్లు నీలోపరిభేగం, సతీష్, తులసి, విజయలక్ష్మి, సిబ్బంది పాల్గొన్నారు.
Updated Date - 2020-06-02T10:57:52+05:30 IST