సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రశాంతం
ABN, First Publish Date - 2020-07-15T11:09:29+05:30
జోన్-4 పరిధిలో మోడల్ స్కూల్స్ ఏపీ బీసీ వెల్ఫేర్ పాఠశాలల్లోని పీజీటీ, టీజీటీ పోస్టుల్లో ఎంపికైన..
14 మంది హాజరు
కడప (ఎడ్యుకేషన్), జూలై 14: జోన్-4 పరిధిలో మోడల్ స్కూల్స్ ఏపీ బీసీ వెల్ఫేర్ పాఠశాలల్లోని పీజీటీ, టీజీటీ పోస్టుల్లో ఎంపికైన అభ్యర్థులకు జరిగిన సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రశాంతంగా జరిగింది. కడప కాగితాలపెంట ఎమ్మార్సీలో మంగళవారం కడప, అనంతపురం, చిత్తూరు, కర్నూలు జిల్లాలకు చెందిన అభ్యర్థులకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించారు. నాలుగు జిల్లాల నుంచి 21 మంది హాజరు కావాల్సి ఉండగా 14 మంది హాజరయ్యారు. ఏడు మంది గైర్హాజరయ్యారు. కార్యక్రమంలో ఆర్జేడీ కార్యాలయం ఏడీ నాగేశ్వర్రావు, సూపరింటెండెంట్ సుకుమార్, సిబ్బంది సుదర్శన్, శ్యామ్, భాను, డేవిడ్, కరీం, వెంకటేశ్, రాబర్ట్ పాల్గొన్నారు.
Updated Date - 2020-07-15T11:09:29+05:30 IST