ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేడు జిల్లాకు సీఎం జగన్‌

ABN, First Publish Date - 2020-07-07T11:01:24+05:30

దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి జయంతి ఉత్సవాల్లో పాల్గొనడానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మంగళవారం జిల్లాకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వైఎస్‌ఆర్‌ ఘాట్‌ వద్ద నివాళి అర్పించనున్న సీఎం

ట్రిపుల్‌ఐటీ సందర్శన 


కడప, జూలై 6 (ఆంధ్రజ్యోతి): దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి జయంతి ఉత్సవాల్లో పాల్గొనడానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మంగళవారం జిల్లాకు రానున్నారు. విజయవాడ నుంచి కడప విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో చేరుకుని ఇక్కడి నుంచి హెలికాప్టర్‌లో ఇడుపులపాయకు చేరుకుంటారు. రాత్రి అక్కడే బస చేస్తారు. బుధవారం వైఎస్‌ఆర్‌ జయంతి వేడుకల్లో పాల్గొంటారు. సీఎం పర్యటన ఏర్పాట్లను కలెక్టర్‌ సి.హరికిరణ్‌ ఆధ్వర్యంలో జిల్లా అధికారులు చేస్తున్నారు. ఎస్పీ కేకేఎన్‌ అన్భురాజన్‌ నేతృత్వంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. సీఎం జగన్‌ రెండు రోజుల పర్యటన షెడ్యూలును విడుదల చేశారు. 


సీఎం పర్యటన షెడ్యూలు

  • 7వ తేదీ సాయంత్రం 3.30 గంటలకు విజయవాడలోని ఇంటి నుంచి బయలుదేరి 3.50 గంటలకు గన్నవరం విమానాశ్రయం చేరుకుని 4 గంటలకు ప్రత్యేక విమానంలో బయలుదేరుతారు.
  • 4.45 గంటలకు కడప విమానాశ్రయం చేరుకుని 4.55 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్‌లో బయలుదేరి ఇడుపులపాయ వైఎస్‌ ఎస్టేట్‌లోని హెలిపాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి 5.20కు రోడ్డు మార్గంలో బయలుదేరి 5.25 గంటలకు గెస్ట్‌హౌస్‌కు చేరుకుంటారు. రాత్రి అక్కడే బస చేస్తారు.
  • 8వ తేదీ ఉదయం 8 గంటలకు గెస్ట్‌హౌస్‌ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి 8.05 గంటలకు ఇడుపులపాయలోని వైఎస్‌ర్‌ ఘాట్‌కు చేరుకుంటారు. 8.10 నుంచి 8.40 గంటల వరకు దివంగత సీఎం వైఎ్‌సకు నివాళులు అర్పిస్తారు. ప్రార్థనల్లో పాల్గొంటారు. 8.45కు అక్కడి రోడ్డు మార్గంలో బయలుదేరి 8.50కు ట్రిపుల్‌ఐటీకి చేరుకుంటారు. 
  • 8.50 నుంచి 9.20 గంటల వరకు ట్రిపుల్‌ఐటీలో నూతన అకడమిక్‌ కాంప్లెక్స్‌, 3 ఎండబ్ల్యూ సోలార్‌ ప్లాంట్‌ను ప్రారంభిస్తారు. వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. 9.20 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 9.25 గంటలకు గెస్ట్‌హౌస్‌ చేరుకుంటారు. 
  • 9.30 నుంచి మధ్యాహ్నం 12.00 గంటల వరకు విశ్రాంతి తీసుకుంటారు. 
  • 12.15 గంటలకు ఇడుపులపాయ వైఎ్‌సఆర్‌ ఎస్టేట్‌ హెలిపాడ్‌ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో బయలుదేరి.. 12.35 గంటలకు కడప విమానాశ్రయం చేరుకుంటారు. 
  • 12.35 గంటలకు కడప నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి.. మధ్యాహ్నం 1.30 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టు చేరుకుంటారు. 1.40 గంటలకు అక్కడి నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి 2.00 గంటలకు సీఎం నివాసానికి చేరుకుంటారు. 

Updated Date - 2020-07-07T11:01:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising