కార్మికుల హక్కులను హరిస్తున్న కేంద్రం
ABN, First Publish Date - 2020-05-23T10:42:16+05:30
కేంద్రంలోని మోదీ సర్కారు కార్మికుల హక్కులు హరించే విధంగా పాలన సాగిస్తోందని ఏఐటీయూసీ, సీఐటీయూ నాయకులు కేంద్ర ప్రభుత్వంపై
ధర్నాలో ఏఐటీయూసీ, సీఐటీయూ నాయకులు
కడప (మారుతీనగర్), మే 22: కేంద్రంలోని మోదీ సర్కారు కార్మికుల హక్కులు హరించే విధంగా పాలన సాగిస్తోందని ఏఐటీయూసీ, సీఐటీయూ నాయకులు కేంద్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. మోదీ సర్కారు కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశ వ్యాప్త కార్మిక సంఘాల ఆందోళనలో భాగంగా శుక్రవారం కలెక్టరేట్ ఎదుట ప్లకార్డులు పట్టుకుని నిరసన, ధర్నా చేపట్టి మాట్లాడారు. కార్యక్రమంలో నాయకులు నాగసుబ్బారెడ్డి, బి.మనోహర్, జి.వేణుగోపాల్, కేసీ బాదుల్లా, మద్దిలేటి, కె.లింగన్న, సుబ్బరాయుడు, గోవిందు, జాన్, నరసింహ, తారక రామారావు, రామ్మోహన్రెడ్డి, విజయ్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2020-05-23T10:42:16+05:30 IST