ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉపాధి అవకాశాల మెరుగుకు పాఠ్యాంశాల్లో మార్పులు

ABN, First Publish Date - 2020-12-20T05:16:10+05:30

ఉపాధి అవకాశాలు మెరుగుపడేందుకే పాఠ్యాంశాలు, ప్రయోగశాలల్లో మార్పులు చేసినట్లు పులివెందుల జేఎన్టీయూ కళాశాల ప్రిన్సిపాల్‌ జీఎస్‌ ఎస్‌ రాజు పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పులివెందుల రూరల్‌, డిసెంబరు 19: ఉపాధి అవకాశాలు మెరుగుపడేందుకే పాఠ్యాంశాలు, ప్రయోగశాలల్లో మార్పులు చేసినట్లు పులివెందుల జేఎన్టీయూ కళాశాల ప్రిన్సిపాల్‌ జీఎస్‌ ఎస్‌ రాజు పేర్కొన్నారు. శనివారం పట్టణంలోని జేఎన్టీయూ కళాశాలలో బోర్డ్‌ ఆఫ్‌ స్టడీస్‌పై ఆన్‌లైన్‌ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్‌ మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వం, ఉన్నత విద్యాశాఖ, ఉన్నత విద్యామండలి సాంకేతిక విద్యలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు ఉన్నత ప్రమాణాల కమిటీని నియమించారన్నారు. ఈ కమిటీ ఏపీలో ఉన్న అన్ని విశ్వవిద్యాలయాల్లో పాఠ్యాంశాలను మెరుగు పరచాలని సూచించారన్నారు. సమావేశం ద్వారా వివిధ ఐఐటీ, ఎన్‌ఐటీ, ఐఐఎస్‌సీ, కేంద్రీయ విశ్వవిద్యాయాల నుంచి నిష్ణాతులైన ప్రొఫెసర్లు పాల్గొని పాఠ్యాంశాల్లో మార్పులు చేశారన్నారు. నూతన పాఠ్యాంశాలు 2020-21 విద్యాసం వత్సరం నుంచి అమలులోకి వస్తాయన్నారు. ఈ కార్యక్రమం లో కళాశాల వైస్‌ ప్రిన్సిపాల్‌ సుబ్బారెడ్డి, వివిధ విభాగాధి పతులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-20T05:16:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising