పోలీసు శాఖలో మీసేవలు చిరస్మరణీయం : ఎస్పీ
ABN, First Publish Date - 2020-07-01T10:32:29+05:30
నిజాయితీ, అంకితభావంతో దాదాపు 35 సంవత్సరాల పాటు పోలీసుశాఖలో అందించిన సేవలు శాఖ ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని జిల్లా
కడప (క్రైం), జూన్ 30 : నిజాయితీ, అంకితభావంతో దాదాపు 35 సంవత్సరాల పాటు పోలీసుశాఖలో అందించిన సేవలు శాఖ ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ అన్నారు. అదనపు ఎస్పీ (ఆపరేషన్) బి.లక్ష్మినారాయణతో పాటు డీటీఆర్బీ సీఐ నరసింహారావు, ఎస్ఐ అబ్దుల్ సయ్యద్, ఏఆర్ ఆర్ఎ్సఐ శంకర్రెడ్డి, మహ్మద్పీర్తో పాటు పలువురు సిబ్బంది పదవీ విరమణ చెందారు. ఈ సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణంలోని పెన్నార్ కాన్ఫరెన్స్ హాలులో పదవీ విరమణ పొందుతున్న సిబ్బంది ఆత్మీయ వీడ్కోలు సన్మాన కార్యక్రమం మంగళవారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ అదనపు ఎస్పీగా డి.లక్ష్మినారాయణ చేసిన సేవలు అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. ఏఎ్సఐ జి.వెంకటయ్య, ఏఆర్ ఎస్ఐ సోమశేఖర్రెడ్డి, ఏఆర్ ఎస్ఐ బి.రామునాయక్, ఏఆర్ ఎస్ఐ షాజిద్పీరా, ఏఆర్ హెడ్కానిస్టేబులు శ్రీరామ్రెడ్డి, శంకర్రాజులను ఎస్పీ ఘనంగా సత్కరించి మెమెంటోలను అందించారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ రమణయ్య, ఆర్ఐలు విజయకుమార్, మహబూబ్బాషా, చంద్రశేఖర్ శ్రీశైలంరెడ్డి, జావీదు, టైటాస్, పోలీసు అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు దూలం సురేష్, కోశాధికారి గంగరాజు, కోఆప్షన్ మెంబరు రామక్రిష్ణ, డీసీఆర్బీ సీఐ ఈశ్వర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2020-07-01T10:32:29+05:30 IST