సీఎం ఏరియల్ సర్వే కనిపించలేదు
ABN, First Publish Date - 2020-11-29T05:11:08+05:30
సీఎం ఏరియల్ సర్వే కనిపించలేదని రైల్వేకోడూరు టీడీపీ నేత పంతగాని నరసింహప్రసాద్ పేర్కొన్నారు.
పెనగలూరు, నవంబరు, 28: సీఎం ఏరియల్ సర్వే కనిపించలేదని రైల్వేకోడూరు టీడీపీ నేత పంతగాని నరసింహప్రసాద్ పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వరద నష్టాన్ని పరిశీలించేందుకు శనివారం జిల్లాలో ఏరియల్ సర్వే చేస్తున్నారని మండలంలో వరద ముంపు గ్రామాల్లో రైతులతో కలిసి బైనాక్యులర్లతో చూసి, చూసి చివరకు నిరాశతో వెనుతిగామని పేర్కొన్నారు. రైతులకు పరిహారం ప్రకటిస్తారని ఎంతో ఆశగా ఎదురు చూశారని తెలిపారు. టీడీపీ నేత మావిళ్ల సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2020-11-29T05:11:08+05:30 IST