స్టాక్ పాయింట్లలో ఇసుక నిల్వలు పెంచాలి
ABN, First Publish Date - 2020-06-03T10:13:07+05:30
జిల్లాలో ఇసుక స్టాక్ పాయింట్లల్లో సాధ్యమైనంత వరకు ఇసుక నిల్వలు
కడప (కలెక్టరేట్), జూన్ 2: జిల్లాలో ఇసుక స్టాక్ పాయింట్లల్లో సాధ్యమైనంత వరకు ఇసుక నిల్వలు పెంచేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సి.హరికిరణ్ అధికారులను ఆదేశించారు. మంగళ వారం కలెక్టర్ అధ్యక్షతన జిల్లా శాండ్ కమిటీ సమావేశం జరిగింది. ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఇసుక కొరత లేకుండా రవాణా జరిగేందుకు సంబంధిత అదికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలన్నారు. రానున్న వర్షాకాలం దృష్ట్యా భవన నిర్మాణ అవసరాల కోసం ఇసుకకు డిమాండ్ ఉంటుందన్నారు.
జమ్మలమడుగు నియోజకవర్గ పరిధిలో గండికోట రిజర్వాయర్ సామర్థ్యం పెంపు కోసం చేపట్టే ముంపు గ్రామస్తులకు పునరావాస నిర్మాణం పనులకు అధిక మొత్తంలో ఇసుక అవసరమన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ గౌతమి, మైన్స్ డీడీ మోహన్ రావు, ఏడీ ఓబులరెడ్డి, డిప్యూటీ ఎస్పీ చెంచుబాబు, భూగర్భశాఖ డీడీ మురళీధర్, డీటీసీ నాగేశ్వరరావు, ఆర్టీఓ శాంతకుమారి, డీపీఓ ప్రభాకర్ రెడ్డి తదితర అదికారులున్నారు.
Updated Date - 2020-06-03T10:13:07+05:30 IST