ఆర్జీయూకేటీ సెట్-2020కు కట్టుదిట్టమైన భద్రత
ABN, First Publish Date - 2020-12-04T05:45:45+05:30
శనివారం నిర్వహించనున్న ఆర్జీయూకేటీ సెట్ -2020కు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నామని డీఈవో శైలజ తెలిపారు.
కడప(ఎడ్యుకేషన), డిసెంబరు 3: శనివారం నిర్వహించనున్న ఆర్జీయూకేటీ సెట్ -2020కు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నామని డీఈవో శైలజ తెలిపారు. జిల్లాలో ఈ పరీక్షలకు 40 మండలాల్లో 67 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. 9440 మంది విద్యార్థులు హాజరవుతున్నట్లు స్పష్టం చేశారు. ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరుగుతుందని, విద్యార్థులను 2 గంటల ముందే కేంద్రాల్లోకి అనుమతిస్తారని అన్నారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతి నిషేధమన్నారు. కొవిడ్ నిబంధనల ప్రకారం విద్యార్థులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సూచించారు. పరీక్ష పూర్తయ్యేంత వరకు ఎవరినీ బయటికి పంపడం జరగదన్నారు. పరీక్ష కేంద్రంలోకి మొబైల్ ఫోన్లు, చేతిగడియారం, ఎటువంటి ఎలకా్ట్రనిక్ పరికరాలు అనుమతించమన్నారు. ఈ మేరకు ఆమె గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు.
Updated Date - 2020-12-04T05:45:45+05:30 IST