రాజంపేట పార్లమెంటు ఉపాధ్యక్షుడుగా బీఎల్
ABN, First Publish Date - 2020-12-12T05:10:47+05:30
రాజంపేట పార్లమెంటు వైసీపీ ఉపాధ్యక్షుడుగా పెనగలూరుకు చెందిన సీనియర్ నాయకుడు బీఎల్ నరసింహారెడ్డిని నియమించినట్లు మాజీ జెడ్పీటీసీ సభ్యుడు కొండూరు విజయ్రెడ్డి తెలిపారు.
పెనగలూరు, డిసెంబరు11 : రాజంపేట పార్లమెంటు వైసీపీ ఉపాధ్యక్షుడుగా పెనగలూరుకు చెందిన సీనియర్ నాయకుడు బీఎల్ నరసింహారెడ్డిని నియమించినట్లు మాజీ జెడ్పీటీసీ సభ్యుడు కొండూరు విజయ్రెడ్డి తెలిపారు. శుక్రవారం సాయంత్రం మాజీ ఎమ్మెల్యే కొండూరు ప్రభావతమ్మ చేతుల మీదుగా ఆమె నివాసంలో నరసింహారెడ్డికి నియామకపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నరసింహారెడ్డి తన నియామకానికి సహకరించిన ఎంపీ మిథున్రెడ్డి, ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే ప్రభావతమ్మకు ధన్యవాదాలు తెలిపారు. యానాదయ్యనాయుడు, ఎ.చిన్నా, వై.సురే్షరెడ్డి, బి.రవిరెడ్డి, పెంచలయ్య పాల్గొన్నారు.
Updated Date - 2020-12-12T05:10:47+05:30 IST