పంట కోత ప్రయోగంలో 31 బస్తాలు
ABN, First Publish Date - 2020-11-22T04:29:50+05:30
పంట కోత ప్రయోగం చేయగా 31 బ స్తాల ధాన్యం వ చ్చిందని ప్రకృతి వ్యవసాయాధికారి నాగరాజు తెలిపారు.
కలసపాడు, న వంబరు 21: చిం తపల్లెలో వెంకటరమణ పొలంలో శనివారం పంట కోత ప్రయోగం చేయగా 31 బ స్తాల ధాన్యం వ చ్చిందని ప్రకృతి వ్యవసాయాధికారి నాగరాజు తెలిపారు. ప్రకృతి వ్యవసాయాధికారి ఆధ్వర్యంలో చెన్నారెడ్డిపల్లె క్లస్టరు చింతపల్లెలో వ రి పంట కోత ప్రయోగం నిర్వహించారు. ఇందులో నిర్ధేశించిన కొలత ల్లో నూర్పిడి చేయగా ఎకరాకు 31బస్తాలు దిగుబడి వచ్చిందన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయంలో ప్రకృతిలో దొరికే వాటితో మందులు చేస్తారని, ఖర్చు తగ్గడంతో పాటు పంట బాగా వస్తుందన్నారు. దానిని ఉపయోగించే వారికి అనారోగ్య సమస్యలు తలెత్తవన్నారు. జడ్పీ ఎనఎ్ఫసీఏ రామసుబ్బారెడ్డి, ఎమ్మార్పీలు బ్రహ్మానందరెడ్డి, వెంకటరమణారెడ్డి, రైతులు పాల్గొన్నారు.
Updated Date - 2020-11-22T04:29:50+05:30 IST