ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ పాలనకు చరమగీతం

ABN, First Publish Date - 2020-08-04T11:16:00+05:30

వైసీపీ పాలనకు చరమగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైందని రైల్వేకోడూరు జనసేన నేత, ప్రముఖ ఆడిటర్‌ గంధంశెట్టి దినకర్‌బాబు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జనసేన సమావేశంలో నేతలు


రైల్వేకోడూరు, ఆగస్టు, 3: వైసీపీ పాలనకు చరమగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైందని రైల్వేకోడూరు జనసేన నేత, ప్రముఖ ఆడిటర్‌ గంధంశెట్టి దినకర్‌బాబు తెలిపారు. సోమవారం స్థానిక పార్టీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ప్రజావ్యతిరేక కార్యక్రమాలు చేస్తోందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. వృద్ధులకు, దివ్యాంగులకు ఇస్తున్న పింఛన్‌ రూ.2500 పెంచడం మరిచిపోయిందన్నారు. ప్రభుత్వం దొంగ సారాను అరికట్టడంలో విఫలం అవుతోందన్నారు.  ఇళ్ల పట్టాల వివరాలను ఆన్‌లైన్‌లో ఉంచాలని డిమాండు చేశారు.  ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు జోగినేని మణి, ఎద్దల అనంతరాయులు, ముద్దపోలు సభాపతి, అంకిపల్లె అఖిల్‌కళ్యాణ్‌, ప్రకాష్‌, మర్రిరెడ్డి హేమంత్‌, మహిళా నాయకురాలు హలీమాబీ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-08-04T11:16:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising