ఏపీకార్ల్ సీఈఓగా బాబు
ABN, First Publish Date - 2020-10-02T07:09:05+05:30
పులివెందులలోని ఆంధ్రప్రదేశ్ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ రీసర్చ్ ఆన్ లైవ్స్టాక్ (ఏపీకార్ల్) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ)గా ఎ.బాబును నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలంసాహ్ని గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
పులివెందుల, అక్టోబరు 1: పులివెందులలోని ఆంధ్రప్రదేశ్ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ రీసర్చ్ ఆన్ లైవ్స్టాక్ (ఏపీకార్ల్) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ)గా ఎ.బాబును నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలంసాహ్ని గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
2003 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన ఈయన ఆంధ్రప్రదేశ్ డెయిరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నారు. అలాగే అమూల్ ప్రాజెక్టు స్పెషలాఫీసర్గా, ఏపీకార్ల్ సీఈఓగా బాబుకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు.
Updated Date - 2020-10-02T07:09:05+05:30 IST