ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ జిల్లా సంయుక్త కార్యదర్శి ఆరెంరెడ్డిపై దాడి

ABN, First Publish Date - 2020-09-26T23:13:30+05:30

వైసీపీ జిల్లా సంయుక్త కార్యదర్శి ఆరెంరెడ్డిపై దాడి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సుండుపల్లె: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతపై అదే పార్టీకి చెందిన మరో నేత వర్గీయులు దాడి చేసిన సంఘటన శుక్రవారం సాయంత్రం జరిగింది. పోలీసుల సమాచారం మేరకు... మండల కేంద్రం సమీపం లోని ఆరెమ్మ దేవాలయంలో వైసీపీ జిల్లా సంయుక్త కార్యదర్శి ఆరెంరెడ్డి తన పుట్టినరోజు సందర్భంగా అనుచరులతో కలిసి పూజలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో రాయవరం గ్రామానికి చెందిన వైసీపీ నేత రఫీక్‌ నాలుగు ఆటోల్లో సుమారు 20 మందితో వచ్చి ఆరెంరెడ్డిపై కట్టెలతో ఒక్కసారిగా దాడి చేశారు. దీంతో ఆరంరెడ్డిని తప్పించబోయిన అతని కుమారుడికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఎస్‌ఐ భక్తవత్సలం సంఘటనా స్థలానికి చేరుకుని  గాయపడిన వారిని రాయచోటి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా ఈ ఘర్షణ వ్యవహారంపై రెండు వర్గాలు ఎస్‌ఐకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దాడికి సంబంధించిన కొంతమందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు ఎస్‌ఐ భక్తవత్సలం తెలిపారు. అయితే వైసీపీ నాయకులు దాడులు చేసుకోవడం మండల వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. 

Updated Date - 2020-09-26T23:13:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising