ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనాతో బెరైటీస్‌ తవ్వకాల నిలిపివేత

ABN, First Publish Date - 2020-08-02T11:14:06+05:30

కరోనాతో బెరైటీస్‌ తవ్వకాల నిలిపివేత

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఓబులవారిపల్లె, ఆగస్టు1: కరోనా కారణంగా కడప జిల్లా ఓబులవారిపల్లె మండలంలోని మంగంపేట బెరైటీస్‌ గనుల తవ్వకాల పనులు శనివారం తాత్కాలికంగా నిలిపివేశారు. ఏపీఎండీసీ మంగంపేట శాఖలో పనిచేసే కార్మికుల్లో 10 మందికి కరోనా పాజిటివ్‌ నమోదుకావడం కలకలం రేపింది. మరికొందరిలో కరోనా లక్షణాలు కనపడటంతో కార్మికుల్లో భయాందోళనలు మొదలయ్యారు. ఈ విషయాన్ని మంగంపేట శాఖ జనరల్‌ మేనేజర్‌ సుదర్శన్‌రెడ్డి యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు. యాజమాన్యం ఆదేశాల మేరకు బెరైటీస్‌ గనుల్లో డీవాటరింగ్‌ పనులు మినహాయించి అన్ని విభాగాల పనులు తాత్కాలికంగా నిలిపివేశారు. పరిపాలనా భవనాలు మొదలుకొని అన్ని విభాగాల్లో శానిటైజర్‌ పనులు చేపట్టారు. ఏపీఎండీసీ యాజమాన్యం కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని అందరికీ కోవిడ్‌-19 పరీక్షలు నిర్వహించాలని కార్మిక సంఘాలు, గ్రామపెద్దలు కోరుతున్నారు.

Updated Date - 2020-08-02T11:14:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising