గుర్తు తెలియని యువకుడికి గాయాలు
ABN, First Publish Date - 2020-12-12T05:23:47+05:30
మండలంలోని నంది పల్లె సమీపంలోని వేంపల్లె-పులివెందుల రహ దారిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 20 ఏళ్ల యువకుడికి గాయాలైనట్లు ఎస్ఐ తిరుపాల్ నాయక్ తెలిపారు.
కడపలో చికిత్స పొందుతున్న యువకుడు
కడప రిమ్స్లో చికిత్స
వేంపల్లె, డిసెంబరు 11: మండలంలోని నంది పల్లె సమీపంలోని వేంపల్లె-పులివెందుల రహ దారిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 20 ఏళ్ల యువకుడికి గాయాలైనట్లు ఎస్ఐ తిరుపాల్ నాయక్ తెలిపారు. శుక్రవారం ఉదయం బైకులో వెళ్తుండగా అదుపుతప్పి కిండపడి గాయపడ్డాడని, స్థానికుల సహకారంతో 108 వాహనం ద్వారా మొదట వేంపల్లె వైద్యశాలకు తరలించామని తెలిపారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్కు తరలించామన్నారు. ఈ యువకుడి ఆచూకీ తెలిసిన వారు వేంపల్లె పోలీసులను సంప్రదించాలని ఎస్ఐ కోరారు.
Updated Date - 2020-12-12T05:23:47+05:30 IST