హైకోర్టు స్టే ఇస్తే భూ పట్టాలు పంచడం న్యాయమా..?
ABN, First Publish Date - 2020-12-30T05:38:19+05:30
రాజంపేట మండలం సుండువారిపల్లెలో హైకోర్టు స్టే ఇచ్చిన భూమిలో పట్టాలివ్వడం న్యాయమా అని జనసేన పార్లమెంటరీ ఇన్చార్జి ముఖరం చాంద్ ప్రశ్నించారు.
జనసేన పార్లమెంట్ ఇన్చార్జి ముఖరంచాంద్
రాజంపేట టౌన్, డిసెంబరు29 : రాజంపేట మండలం సుండువారిపల్లెలో హైకోర్టు స్టే ఇచ్చిన భూమిలో పట్టాలివ్వడం న్యాయమా అని జనసేన పార్లమెంటరీ ఇన్చార్జి ముఖరం చాంద్ ప్రశ్నించారు. మంగళవారం రాజంపేటలో జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇళ్ల పట్టాలు వైసీపీ కార్యకర్తలకు, నాయకులకు ఇచ్చి పేదల కడుపుకొట్టారన్నారు. సుండువారిపల్లె ప్రాంతంలో సర్వేనెంబరు 1202, 1203 భూమిని కేంద్రీయ విశ్వవిద్యాలయానికి కేటాయిస్తే ఆ భూమిని కబ్జా చేశారన్నారు.
Updated Date - 2020-12-30T05:38:19+05:30 IST