గృహ నిర్మాణ లబ్ధిదారులు ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు పూర్తి చేయాలి
ABN, First Publish Date - 2020-12-31T05:10:34+05:30
అన్నమాచార్య అర్బన్ డెవల్పమెంట్ అథారిటీ, పథకం లబ్ధిదారులు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలని ఎంపీడీవో శ్యాంసన్ ఆదేశించారు.
చిట్వేలి, డిసెంబరు30 : అన్నమాచార్య అర్బన్ డెవల్పమెంట్ అథారిటీ, పథకం లబ్ధిదారులు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలని ఎంపీడీవో శ్యాంసన్ ఆదేశించారు. బుధవారం నాగవరంలో అన్నమాచార్య అర్బన్ డెవల్పమెంట్ అథారిటీ పథకంపై జరిగిన సమావేశంలో ఎంపీడీవో మాట్లాడుతూ చిట్వేలి మండలంలో నాగవరం, సి.ఎం.రాచపల్లె గ్రామ పంచాయతీలు అడా పథకం కింద ఎంపికైనట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ ఏఈ సుధాకర్, పంచాయతీ కార్యదర్శి రమణ, ఇంజనీరింగ్ అసిస్టెంట్ గంగాధరం, డిజిటల్ అసిస్టెంట్లు నాగేంద్రబాబు, సుధాకర్, గ్రామవలంటీర్లు పాల్గొన్నారు.
Updated Date - 2020-12-31T05:10:34+05:30 IST