గ్రీన్జోన్ అంటూ వీధుల్లోకి ప్రజలు
ABN, First Publish Date - 2020-05-20T11:05:04+05:30
చివరి కేసు నెగిటివ్గా మారి 28 రోజులు పూర్తి చేసుకోవడంతో కలెక్టర్ హరికిరణ్ ప్రకటనతో పులివెందుల ప్రజలు వీధు ల్లోకి చేరారు. వెంటనే
పులివెందుల, మే 19: చివరి కేసు నెగిటివ్గా మారి 28 రోజులు పూర్తి చేసుకోవడంతో కలెక్టర్ హరికిరణ్ ప్రకటనతో పులివెందుల ప్రజలు వీధు ల్లోకి చేరారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు గ్రీన్ జోన్గా మారినా ఆంక్షలు మాత్రం ఉంటాయన్న విషయాన్ని గుర్తించక బయటకు వచ్చిన ప్రజలను కట్టడిచేశారు. వివరాల్లోకెళితే... పులివెందులలో ఏప్రిల్ 1న మొట్టమొదటి కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. ప్రభుత్వం పులివెందులను రెడ్జోన్గా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
అయితే చివరి పాజిటివ్ కేసు నెగిటివ్గా మారి 28రోజులు పూర్తిచేసుకోవడంతో మంగళవారం నుంచి పులివెందుల గ్రీన్జోన్గా మారుతుందని జిల్లా కలెక్టర్ ప్రకటించడంతో ప్రజలు ఇక ఎలాంటి ఆంక్షలు ఉండవని మంగళవారం ఉదయమే వీధుల్లోకి వచ్చారు. ఉదయం 8:30గంటలకే ప్రధాన వీధులన్నీ ప్రజల రద్దీతో కనిపించింది. వెంటనే పోలీసులు కేవలం కంటైన్మెంట్ జోన్ (రెడ్జోన్) మినహాయించారే తప్ప లాక్డౌన్ కొనసాగుతుందని పోలీసు లు వివరిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రం ప్రజలు బయటకు వచ్చి పనులు ముగించుకుని వెళ్లాలే తప్ప ఇష్టమొచ్చినట్లు గుంపులుగా కనిపిస్తే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
Updated Date - 2020-05-20T11:05:04+05:30 IST