కరోనా సోకిన ఆర్యవైశ్యులకు ఉచిత వైద్య చికిత్స
ABN, First Publish Date - 2020-08-09T11:34:09+05:30
కరోనా సోకిన ఆర్యవైశ్యులకు ఉచిత వైద్య చికి త్సలు అందిస్తామని ఆర్యవైశ్య సభ అధ్యక్షుడు బుశెట్టి రామమోహన్రావు తెలిపారు.
కరోనా సోకిన ఆర్యవైశ్యులకు ఉచిత వైద్య చికిత్స
ప్రొద్దుటూరు టౌన్, ఆగస్టు 8: కరోనా సోకిన ఆర్యవైశ్యులకు ఉచిత వైద్య చికి త్సలు అందిస్తామని ఆర్యవైశ్య సభ అధ్యక్షుడు బుశెట్టి రామమోహన్రావు తెలిపారు. పట్టణంలో కరోనా వైరస్ విజృంభిస్తుండడంతో అనేక మంది ఆర్యవైశ్యులు కరోనా బారీన పడ్డారని తెలిపారు. తాను కూడా కరోనా వైరస్ బారీన పడి వైద్యసాయం తీసుకుని వైరస్ నుంచి బయటపడ్డానన్నారు.
కరోనాతో ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్న ఆర్యవైశ్యులకు సంఘం ద్వారా తగిన సా యం చేయడానికి బుశెట్టి శ్రీరాములు, బుశెట్టి ధనలక్షుమ్మ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో ప్రియభావన ఆస్పత్రిలో ఉచితంగా వైద్య చికిత్సలు అందిస్తామని తెలిపారు. బాధితులు తమను సంప్రదించాలని కోరారు.
Updated Date - 2020-08-09T11:34:09+05:30 IST