కరోనా దూకుడు
ABN, First Publish Date - 2020-07-07T10:58:30+05:30
జిల్లాలో కరోనా రోజు రోజుకు విజృంభిస్తోంది. సోమవారం 96 కేసులు నమోదయ్యాయి. కేసులు తీవ్రంగా పెరుగుతుండడంతో జనంలో భయాందోళనలు రేకెత్తుతున్నాయి.
ఒకేరోజు 96 పాజిటివ్ కేసులు నమోదు
పుల్లారెడ్డిపేటపై పడక
జిల్లాలో 1481 పాజిటివ్ కేసులు
43 మంది డిశ్చార్జి
(కడప - ఆంధ్రజ్యోతి):
జిల్లాలో కరోనా రోజు రోజుకు విజృంభిస్తోంది. సోమవారం 96 కేసులు నమోదయ్యాయి. కేసులు తీవ్రంగా పెరుగుతుండడంతో జనంలో భయాందోళనలు రేకెత్తుతున్నాయి. వైరస్ వ్యాప్తిని పరిశీలిస్తే.. సామూహిక వ్యాప్తి దశలో ఉన్నామన్న భయం నెలకొంటోంది. మొత్తం కేసులు 1481కు చేరుకున్నాయి. కడపలో శంకరాపురం, మహిళా పాలిటెక్నిక్ కళాశాల ప్రాంతం, ఎక్సైజ్ స్టేషన్ ప్రాంతం, సింగపూర్ టౌన్షి్ప, శివాజీనగర్ , రవీంద్రనగర్ల లో 9 కేసులు నమోదయ్యాయి. ప్రొద్దుటూరు పట్టణం కంటైన్మెంటు జోన్ పరిధిలో 18 కేసులు నమోదయ్యాయి. దువ్వూరు మండలంలోని పుల్లారెడ్డిపేటపై కరోనా పగబట్టినట్లుంది అక్కడ ఏకంగా 22 కేసులు నమోదయ్యాయి.
పులివెందులలో 7, రాజంపేటలో 7, ఎర్రగుంట్లలో 6, రైల్వేకోడూరులో 4, సీకేదిన్నెలో 3, మైదుకూరులో 3, నందలూరులో 3, చిట్వేలిలో 2, బి.మఠం, లింగాల, సింహాద్రిపురం, జమ్మలమడుగు, వేంపల్లె, రాజుపాలెం, సిద్దవటం, రామాపురం, చాపాడు, ఖాజీపేట, టి.సుండుపల్లె, బద్వేలులలో ఒక్కొక్క కేసు నమోదయ్యాయి.
43 మంది డిశ్చార్జి
జిల్లా కోవిడ్-19 ఆసుపత్రిలో చికిత్స పొంది 43 మంది కోలుకోవడంతో వారిని సోమవారం డిశ్చార్జి చేసినట్లు కలెక్టరు హరికిరణ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇప్పటి వరకు 528 మందిని డిశ్చార్జి చేశామన్నారు.
కోవిడ్-19 సమాచారం
మొత్తం శాంపిల్స్ - 80105
రిజల్ట్ వచ్చినవి - 75888
నెగటివ్ - 74407
పాజిటివ్ - 1481
డిశ్చార్జ్ అయినవారు - 528
రిజల్ట్ రావాల్సినవి - 4217
జూలై 6వ తేదీ తీసిన శాంపిల్స్ - 1405
Updated Date - 2020-07-07T10:58:30+05:30 IST