ఉపాధి పనుల జోష్
ABN, First Publish Date - 2020-05-22T11:23:33+05:30
ఉపాధి హామీ పనులు జోష్గా సాగుతున్నాయి. లాక్డౌన్ సడలింపుతో పనులకు వచ్చే వారి సంఖ్య క్రమేపీ పెరుగుతూ వస్తోంది. వేసవిలో వీలైనంత
21న రికార్డు స్థాయిలో 2,03,369 మంది హాజరు
కడప, మే 21 (ఆంధ్రజ్యోతి): ఉపాధి హామీ పనులు జోష్గా సాగుతున్నాయి. లాక్డౌన్ సడలింపుతో పనులకు వచ్చే వారి సంఖ్య క్రమేపీ పెరుగుతూ వస్తోంది. వేసవిలో వీలైనంత మందికి వీలైనన్ని పనిదినాలు కల్పించాలని డ్వామా పీడీ యధుభూషణ్రెడ్డి పక్కా ప్రణాళికలు రూపొందించారు. ఆ దిశగా సిబ్బందికి ఆదేశాలివ్వడంతో పనికి వచ్చే వారి సంఖ్య రికార్డు స్థాయికి చేరుకుంటోంది. గురువారం 2,03,369 మంది కూలీలు హాజరై రికార్డు సృష్టించారు. ఇంత పెద్ద ఎత్తున కూలీలు హాజరు కావడంతో అధికార యంత్రాంగం కూడా ఖుషీగా ఉంది.
Updated Date - 2020-05-22T11:23:33+05:30 IST