ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బావి నీటితోనే దద్దుర్లు

ABN, First Publish Date - 2020-12-31T05:09:49+05:30

మండలంలోని మోట్నూతలపల్లెలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి అనిల్‌కుమార్‌ బుధవారం పర్యటించారు.

బావి నీటిని పరిశీలిస్తున్న డీఎంహెచ్‌వో
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డీఎంహెచ్‌వో అనిల్‌కుమార్‌


పులివెందుల రూరల్‌, డిసెంబరు 30: మండలంలోని మోట్నూతలపల్లెలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి అనిల్‌కుమార్‌ బుధవారం పర్యటించారు. గ్రామంలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న వైద్యశిబిరాన్ని ఆయన పరిశీలించారు. గ్రామ ప్రజల ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు ఉపయోగించే బావి నీరు కలుషితమైందని అందువల్ల దద్దుర్లు, గజ్జి, తామర వంటి వ్యాధులు వస్తున్నాయని ప్రజలకు తెలియజేశారు. అలాగే ట్యాంకులను శుభ్రం చేయించామని, వేడి నీటిని మాత్రమే తాగాలని, వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలియజేశారు. అనంతరం పులివెందుల పట్టణంలోని నగరిగుట్ట అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌ను పరిశీలించి రోగుల వివరాలు తెలుసుకున్నారు. కార్యక్రమంలో మండల వైద్యాధికారిణి శరణ్య, చర్మ వ్యాధి నిపుణులు నరోత్తమరెడ్డి, సంతకొవ్వూరు వైద్యాధికారి పవన్‌, గణాంకాల అధికారులు జార్జ్‌, ఓబులరెడ్డి, సతీ్‌షకుమార్‌, ఆరోగ్య, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-31T05:09:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising