మరో 547 కరోనా పాజిటివ్ కేసులు
ABN, First Publish Date - 2020-08-02T11:14:22+05:30
మరో 547 కరోనా పాజిటివ్ కేసులు
కడప, ఆగస్టు 1(ఆంధ్రజ్యోతి): జిల్లాలో కరోనా కలకలం కొనసాగుతోంది. శుక్రవారం ఉదయం 9గంటల నుంచి శనివారం ఉదయం 9గంటల్లోపు 547 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. దీంతో జిల్లాలో మొత్తం బాధితుల సంఖ్య 8563కి చేరింది. కరోనాతో ముగ్గురు మృత్యువాతపడ్డారు. దీంతో మృతుల సంఖ్య 111కు చేరుకుంది. ఫాతిమా, రిమ్స్ కొవిడ్ సెంటర్లలో చికిత్స పొందిన 160 మందిని డిశ్చార్జి చేశారు. ఇప్పటివరకు కొవిడ్ బారిన పడ్డ వారిలో 4144 మంది కోలుకున్నారు. కరోనా పాజిటివ్ బాఽధితులు 1874 మంది హోం ఐసోలేషన్లోనే వైద్య సేవలు పొందుతున్నట్లు అధికారులు వెల్లడించారు.
Updated Date - 2020-08-02T11:14:22+05:30 IST