ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజధానిపై ప్రభుత్వం మొండి వైఖరి వీడాలి: టీడీపీ

ABN, First Publish Date - 2020-12-18T05:04:12+05:30

రాష్ట్ర రాజధాని అమరావతి విషయంలో ప్రభుత్వం తన మొండి వైఖరిని వీడాలని టీడీపీ రైల్వేకోడూరు ఇన్‌చార్జ్‌ కస్తూరి విశ్వనాథనాయుడు డిమాండ్‌ చేశారు.

రైల్వేకోడూరులో దీక్ష చేపడుతున్న టీడీపీ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రైల్వేకోడూరు, డిసెంబరు, 17: రాష్ట్ర రాజధాని అమరావతి విషయంలో ప్రభుత్వం తన మొండి వైఖరిని వీడాలని టీడీపీ రైల్వేకోడూరు ఇన్‌చార్జ్‌ కస్తూరి విశ్వనాథనాయుడు డిమాండ్‌ చేశారు. అమరావతి ఉద్యమం చేపట్టి ఏడాది పూర్తి అయిన సందర్భంగా గురువారం స్థానిక టోల్గేట్‌ వద్ద టీడీపీ మండల అధ్యక్షుడు కొమ్మా శివ ఆధ్వర్యంలో దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా కస్తూరి మాట్లాడుతూ వైసీపీది రెండు నాల్కుల ధోరణి అన్నారు. మూ డు రాజధానుల వల్ల ప్రజలకు ఒరిగేది ఏమీ ఉండదన్నారు. విశాఖలో పరిపాలన, అమరావతిలో అసెంబ్లీ, కర్నూలులో హైకోర్టు.. ఇలా ఎన్ని పెడతారని ప్రశ్నించారు. అమరావతి రైతులు రాజధాని కోసం వేలాది ఎకరాలు ఇచ్చారని పేర్కొన్నారు. కార్యక్రమంలో సీనియర్‌ నేత మాచినేని విశ్వేశ్వరనాయుడు, టీడీపీ రైతు విభాగం జిల్లా కార్యదర్శి పీకే నా యుడు, శాప్‌ మాజీ డైరెక్టర్‌ దుద్యాల జయచంద్ర, తెలుగు యువత రాష్ట్ర నాయకుడు చిగురుపాటి ధనుంజయనాయుడు, కోడూరు జనార్దన్‌నాయుడు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2020-12-18T05:04:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising