సచివాలయ భవనాలకు రంగు మార్చండి
ABN, First Publish Date - 2020-06-28T07:18:28+05:30
గ్రామ, వార్డు సచివాలయ భవనాలకు రంగులు మార్చాలని ప్రభుత్వం ఆదేశించింది. అన్నింటికీ తెలుపు రంగు వేయాలని, అయితే
వెలువడిన ప్రభుత్వ ఆదేశాలు
కడప, జూన్ 27 (ఆంధ్రజ్యోతి): గ్రామ, వార్డు సచివాలయ భవనాలకు రంగులు మార్చాలని ప్రభుత్వం ఆదేశించింది. అన్నింటికీ తెలుపు రంగు వేయాలని, అయితే ప్రతి కేంద్రానికి సీఎం జగన్ ఫొటో ఉంచాలని సూచించింది. వైపీపీ పోలిన రంగులను ప్రభుత్వ కార్యాలయాలకు వేయడం పట్ల పలువురు హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు వ్యతిరేకించింది. అయితే ప్రభుత్వం హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లింది. రంగులపై సుప్రీం కూడా హైకోర్టు తీర్పును సమర్థించింది. ఈ నేపథ్యంలో శనివారం ప్రభుత్వం ఇచ్చిన తాజా ఆదేశాలతో జిల్లాలోని 885 గ్రామ, వార్డు సచివాలయాల రంగు మార్చనున్నారు. దీనిపై ఓ అధికారి మాట్లాడుతూ తమకు ఇంకా అధికారికంగా సమాచారం రాలేదని, కలెక్టర్ ఆదేశిస్తే రంగులు మారుస్తామని చెప్పారు.
Updated Date - 2020-06-28T07:18:28+05:30 IST