ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భూ వివాద సంఘటనలో.. కోపంతో సొంత అన్ననే..

ABN, First Publish Date - 2020-07-27T18:24:01+05:30

బద్వేలు మండలం లక్ష్మీపాళెం గ్రామ పంచాయతీ పరిధిలోని అనంతరాజపురం గ్రామ పంచాయతీలో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బద్వేలు(కడప): బద్వేలు మండలం లక్ష్మీపాళెం గ్రామ పంచాయతీ పరిధిలోని అనంతరాజపురం గ్రామ పంచాయతీలో భూ వివాద సంఘటనలో తమ్ముడిని అన్న హతమార్చిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్‌ఐ వివరాల మేరకు... అనంతరాజపురం గ్రామానికి చెందిన పెద్ద వెంకటసుబ్బయ్య, చిన్న వెంకటసుబ్బయ్యలు ఇద్దరు అన్నదమ్ములని వీరు కొంతకాలంగా కువైట్‌కు వెళ్లారని లాక్‌డౌన్‌ నే పథ్యంలో  తిరిగి స్వగ్రామానికి చేరుకున్నారని అప్పటినుంచి అన్నదమ్ముల మధ్య భూ వివాధం జరుగుతుండేదన్నారు. శుక్రవారం పొలం వద్ద అన్నదమ్ముల మధ్య మాటామాటా పెరిగి ఘర్షణ పడ్డారు.


ఈ ఘర్షణలో అన్న అయిన చిన్న వెంకటసుబ్బయ్య బండరాయితో తమ్ముడైన చిన్న వెంకటసుబ్బయ్యను తలపై కొట్టడంతో రక్తగాయాలతో పొలం వద్ద పడిపోయారు. ఈ విషయాన్ని  గ్రామస్థులకు పెద్ద వెంకటసుబ్బయ్య తెలపడంతో గ్రామస్థులు, చిన్న వెంకటసుబ్బయ్య భార్య సంఘటనా స్థలానికి వెళ్లి చిన్న వెంకటసుబ్బయ్యను బద్వేలులోని ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో కడపకు తీసుకెళ్లారు. కడపలో కూడా పరిస్థితి అదుపు తప్పడంతో తిరుపతికి తీసుకెళ్లారు. మెరుగైన వైద్య చికిత్సకోసం తిరుపతినుంచి చెన్నైకి తరలిస్తుండగా ఆదివారం మార్గమధ్యలో మృతిచెందాడని, మృతుని భార్య వెంకటమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.


Updated Date - 2020-07-27T18:24:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising