ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అన్నమయ్య ప్రాజెక్టు నుంచి..చివరి ఆయకట్టుకు అందని నీరు

ABN, First Publish Date - 2020-05-28T10:38:42+05:30

రాజంపేట ప్రాంతంలో అన్నమయ్య ప్రాజెక్టు చివరి ఆయకట్టు కు నీరందక పంటలు ఎండిపోతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎండిపోతున్న పంటలు 

ఆందోళనలో రైతన్నలు


రాజంపేట, మే27 : రాజంపేట ప్రాంతంలో అన్నమయ్య ప్రాజెక్టు చివరి ఆయకట్టు కు నీరందక పంటలు ఎండిపోతున్నాయి. అన్నమయ్య ప్రాజెక్టు ఆయకట్టు ప్రాంతమైన మిట్టమీదపల్లె, కొల్లావారిపల్లె, బావికాడపల్లె, పుల్లంపేట ప్రాంతాల్లోని వివిధ గ్రామాల్లోని భూములకు అన్నమయ్య ప్రాజెక్టు నీరు అందడం లేదు. వరుసగా వర్షాలు లేకపోవడం... ప్రాజెక్టులో స్వల్పంగా నీరు ఉండటంతో చివరి ఆయకట్టు ప్రాంతాలకు నీరు అందడం లేదు.


ఇటీవల చెయ్యేటి నుంచి గేట్ల ద్వారా దిగువ ప్రాంతాలకు భూగర్భజలాల పెంపు కోసం కేవలం 450 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. అదే విధంగా చివరి ఆయకట్టు ప్రాంతాలకు నీటిని విడుదల చేసి ఉంటే ప్రస్తుతం సాగుచేసిన పంటలకు కాస్తోకూస్తో పండేవని ఆ ప్రాంత రైతులు చెబుతున్నారు. ఇప్పటికైనా అన్నమయ్య ప్రాజెక్టు అధికారులు స్పందించి రాజంపేట, పుల్లంపేట మండలాల్లోని అన్నమయ్య చివరి ఆయకట్టు ప్రాంతాలకు నీరు వదలాలని ఆ ప్రాంత రైతులు వేడుకుంటున్నారు. 

Updated Date - 2020-05-28T10:38:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising