మల్లన్న సేవలో జస్టిస్ ఎన్వీ రమణ
ABN, First Publish Date - 2020-12-30T08:30:35+05:30
శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లను మంగళవారం సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.
శ్రీశైలం, డిసెంబరు 29: శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లను మంగళవారం సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆయనకు దేవస్థానం రాజగోపురం వద్ద ఈవో కేఎస్ రామరావు స్వాగతం పలికారు. దర్శనం అనంతరం భ్రమరాంబదేవి ఆలయ ప్రాంగణం ఆశీర్వచన మండపంలో జస్టిస్ ఎన్వీ రమణకు స్వామివార్ల శేష వస్త్రాలను ఇచ్చి, తీర్థ ప్రసాదాలను అందజేశారు.
Updated Date - 2020-12-30T08:30:35+05:30 IST