ఆస్పత్రి పైనుంచి దూకి... కరోనా బాధితుడి ఆత్మహత్య
ABN, First Publish Date - 2020-08-15T10:47:29+05:30
కరోనా సోకిన ఓ వృద్ధుడు ఆస్పత్రి భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
మంగళగిరి క్రైమ్, ఆగస్టు 14: కరోనా సోకిన ఓ వృద్ధుడు ఆస్పత్రి భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గుంటూరు నగరానికి చెందిన వృద్ధుడి(66)కి ఇటీవల కరోనా నిర్ధారణ అయింది. ఈ నెల 12న మంగళగిరిలోని ఎన్నారై వైద్యశాల కొవిడ్ క్వారంటైన్ సెంటర్లో చేరాడు. గురువారం రాత్రి అందరితో పాటు భోజనం చేసిన వృద్ధుడు అర్ధరాత్రి సమయంలో ఆస్పత్రిలోని మూడో అంతస్తు నుంచి కిందికి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన ఆస్పత్రి సెక్యూరిటీ సిబ్బంది తీవ్రంగా గాయపడిన ఆయన్ను ఐసీయూకు తరలించగా కొద్దిసేపటికే మృతి చెందాడు.
Updated Date - 2020-08-15T10:47:29+05:30 IST