8వ రోజుకి చేరిన జూడాల ఆందోళన
ABN, First Publish Date - 2020-08-14T14:15:44+05:30
ఆంధ్రప్రదేశ్ జూనియర్ డాక్టర్స్ చేస్తున్న ఆందోళన శుక్రవారం నాటికి 8వ రోజుకి చేరింది.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ జూనియర్ డాక్టర్స్ చేస్తున్న ఆందోళన శుక్రవారం నాటికి 8వ రోజుకి చేరింది. 45శాతం డిమాండ్కు విరుద్ధంగా 23శాతం స్టైపెండ్ పెంపును అందించడం తగదని అన్నారు. తమ ప్రధాన సమస్యలను సంబంధిత అధికారులు పరిష్కరించలేదని అన్నారు. గత మూడు రోజులుగా జనరల్ ఓపీడీ, వార్డుల సేవలు బహిష్కరించామని.. ఈ నెల 16వ తేదీ లోపు తమ సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఈ నెల 17వ తేదీ నుంచి 20వ తేదీ వరకు అత్యవసర సేవలను బహిష్కరిస్తామని జూడాలు స్పష్టం చేశారు.
Updated Date - 2020-08-14T14:15:44+05:30 IST