శరణార్థులకు పౌరసత్వం ఇవ్వడమే సీఏఏ ఉద్దేశం: జేడీ లక్ష్మీనారాయణ
ABN, First Publish Date - 2020-02-03T02:00:11+05:30
మన దేశం ధర్మశాల కాదని, దేశ భద్రత చాలా ముఖ్యమని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. ఆప్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన శరణార్థులకు పౌరసత్వం ఇవ్వడమే సీఏఏ ఉద్దేశమని ఆయన స్పష్టంచేశారు. అసోంలో శరణార్థుల కోసమే..
మన దేశం ధర్మశాల కాదని, దేశ భద్రత చాలా ముఖ్యమని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. ఆప్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన శరణార్థులకు పౌరసత్వం ఇవ్వడమే సీఏఏ ఉద్దేశమని ఆయన స్పష్టంచేశారు. అసోంలో శరణార్థుల కోసమే ఎన్ఆర్సీ తీసుకొచ్చారన్నారు. ఎన్ఆర్సీ వల్ల ఎవరికీ నష్టం జరగదని ప్రధాని హామీ ఇచ్చారని వ్యాఖ్యానించారు. పదేళ్లకోసారి ఎన్పీఆర్ సర్వే జరుగుతుందని చెప్పారు. ప్రతి ఒక్కరూ సిటిజన్ షిప్ నిరూపించుకోవడంలో తప్పులేదన్నారు. రాజకీయాలను క్యాష్, క్యాస్ట్ ప్రభావితం చేస్తున్నాయని లక్ష్మీనారాయణ తెలిపారు.
Updated Date - 2020-02-03T02:00:11+05:30 IST