ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దాడులను నిరసిస్తే అరెస్టులా?: జేసీ పవన్‌

ABN, First Publish Date - 2020-11-25T09:06:00+05:30

రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో బడుగు, బలహీన, మైనార్టీ వర్గాలపై దాడులు, మహిళలపై సాగిస్తున్న ఆకృత్యాలను నిరసిస్తే.. అరెస్టులు చేయడమేంటని అనంతపురం పార్లమెంటు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌ జేసీ పవన్‌ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆకృత్యాలు, అక్రమ కేసులను నిరసిస్తూ.. ఆయన నగరంలో మంగళవారం బైక్‌ ర్యాలీకి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతలో బైక్‌ ర్యాలీని అడ్డుకున్న పోలీసులు


అనంతపురం, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో బడుగు, బలహీన, మైనార్టీ వర్గాలపై దాడులు, మహిళలపై సాగిస్తున్న ఆకృత్యాలను నిరసిస్తే.. అరెస్టులు చేయడమేంటని అనంతపురం పార్లమెంటు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌ జేసీ పవన్‌ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆకృత్యాలు, అక్రమ కేసులను నిరసిస్తూ.. ఆయన నగరంలో మంగళవారం బైక్‌ ర్యాలీకి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో పెద్దఎత్తున పార్టీ శ్రేణులు, యువత.. పవన్‌రెడ్డి క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. సాయంత్రం 4 గంటలకు బైక్‌ ర్యాలీ ప్రారంభించగానే నగరంలోని పోలీసు అధికారులు, సిబ్బంది ఒక్కసారిగా అక్కడికి చేరుకుని అనుమతి లేదంటూ అడ్డుకున్నారు.


ఈ క్రమంలో పోలీసులు, తెలుగుదేశం పార్టీ శ్రేణుల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం తలెత్తింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యకర్తలు నినాదాలు చేశారు. ఈ ఆందోళన కొనసాగుతుండగానే  పోలీసులు.. పవన్‌రెడ్డిని బలవంతంగా అరెస్టు చేసి, టూటౌన్‌ స్టేషన్‌కు తరలించారు. అనంతరం ఆయనను సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. ఈ సందర్భంగా పవన్‌రెడ్డి మాట్లాడుతూ.. పోలీసు బెదిరింపులు, అరెస్టులకు భయపడే ప్రసక్తే లేదన్నారు. 

Updated Date - 2020-11-25T09:06:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising