ఏపీ ప్రభుత్వం అభూత కల్పనతో ప్రచారం: శివశంకర్
ABN, First Publish Date - 2020-08-02T20:14:00+05:30
రాజధాని వికేంద్రీకరణ ద్వారా అభివృద్ధి చేస్తామని ప్రభుత్వం అభూత కల్పనతో..
అమరావతి: రాజధాని వికేంద్రీకరణ ద్వారా అభివృద్ధి చేస్తామని ప్రభుత్వం అభూత కల్పనతో కూడిన ప్రచారం చేస్తోందని జనసేన నేత టి.శివశంకర్ విమర్శించారు. ఆదివారం జరిగిన జనసేన పార్టీ పొలిటికల్ కమిటీ టెలీ కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడుగూ విశాఖకు ఎగ్జిక్యూటివ్ రాజధాని వస్తే ఉత్తరాంధ్ర అంతా అభివృద్ధి చెందుతుందా? అని ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర ప్రజలకు రాజధానిలోని సచివాలయంలోకి వెళ్ళి పనులు చేయించుకొనేంత అవసరాలు ఉండవన్నారు. ఉత్తరాంధ్ర ప్రజలకు కావాల్సింది ఉద్యోగాలు, ఉపాధి అని.. వాటి కల్పనపై ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదన్నారు. అటు టీడీపీ...ఇటు వైసీపీ తమ రాజకీయ క్రీడకు రాజధానిని వాడుకుంటున్నారని శివశంకర్ విమర్శించారు
Updated Date - 2020-08-02T20:14:00+05:30 IST