108, 104 ప్రాణాలు కాపాడడానికా?... మృతదేహాలు తరలించడానికా?: పోతిన
ABN, First Publish Date - 2020-07-01T14:40:54+05:30
108, 104 ప్రాణాలు కాపాడడానికా?... మృతదేహాలు తరలించడానికా?: పోతిన
అమరావతి: మామ పుట్టినరోజున అల్లుడు కంపెనీకి దోచిపెట్టిన వందల కోట్ల రూపాయల అక్రమ కాంట్రాక్టర్లకు బెంజిసర్కిల్ వద్ద నేడు పట్టాభిషేకం జరుగనుందని జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ‘‘విజయవాడకు కూతవేటు దూరంలో నివాసముంటున్న సీఎం జగన్ గారు కరోనా విజృంభించి, ప్రజల ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని అల్లాడుతున్నా కనీసం ఒక సమీక్ష సమావేశం నిర్వహించారా?. మీరు ప్రజల ప్రాణాల కన్నా పథకాల ప్రచారం కోసం బయటకు వస్తారా?. విజయవాడ నగరానికి 108, 104 ప్రాణాలు కాపాడటానికా లేక మృతదేహాలు తరలించడానికా?’’ అని వెంకట మహేష్ ప్రశ్నించారు.
Updated Date - 2020-07-01T14:40:54+05:30 IST