ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మంత్రి క్షమాపణ చెప్పాలి: జనసేన నేత

ABN, First Publish Date - 2020-05-19T01:36:09+05:30

దుర్గమ్మ భక్తులకు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ రావు బహిరంగ క్షమాపణ చెప్పాలని జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్ డిమాండ్ చేశారు. సోమవారం ఇక్కడ మీడియాతో మాట్లాడిన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: దుర్గమ్మ భక్తులకు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ రావు బహిరంగ క్షమాపణ చెప్పాలని జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్ డిమాండ్ చేశారు. సోమవారం ఇక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన.. దుర్గమ్మ సన్నిధిలో రాజకీయ సమావేశాలు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. అర్హతలేని అసమర్థ ఈవో అని సురేష్ బాబు మరోసారి రుజువు చేసుకున్నారని విమర్శించారు. దేవస్థానం పవిత్రతను, ప్రతిష్టను కాపాడాల్సిన మంత్రి.. వైసీపీ స్థానిక అభ్యర్థులతో సమావేశం ఎలా నిర్వహిస్తారని మహేష్ ప్రశ్నించారు. ఆలయ పరిధిలో రాజకీయ సమావేశం జరిపి భక్తుల మనోభావాలను ఘోరంగా దెబ్బ తీశారని, మంత్రి శ్రీనివాస్ ప్రజలకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని మహేష్ డిమాండ్ చేశారు. దుర్గమ్మ సన్నిధిని వైసీపీ కార్యాలయంగా మార్చడంపై ఈవో సమాధానం చెప్పాలన్నారు. దుర్గమ్మ గుడికి వైసీపీ రంగులు వేసినా ఈవో చూస్తూ ఊరుకుంటారేమో అనే అనుమానం కలుగుతోందన్నారు. దుర్గ గుడిలో రాజకీయ సమావేశంపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

Updated Date - 2020-05-19T01:36:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising