దళితులపై జగన్రెడ్డి దమనకాండ కొనసాగుతూనే ఉంది: లోకేష్
ABN, First Publish Date - 2020-09-19T21:36:46+05:30
దళితులపై జగన్రెడ్డి దమనకాండ కొనసాగుతూనే ఉందని టీడీపీ నేత లోకేష్ ధ్వజమెత్తారు. శిరోముండనాలు, దాడులు, హత్యలు, అత్యాచారాలు.. భూముల కబ్జా వైసీపీ నేతలకు దినచర్యగా మారిందని
అమరావతి: దళితులపై జగన్రెడ్డి దమనకాండ కొనసాగుతూనే ఉందని టీడీపీ నేత లోకేష్ ధ్వజమెత్తారు. శిరోముండనాలు, దాడులు, హత్యలు, అత్యాచారాలు.. భూముల కబ్జా వైసీపీ నేతలకు దినచర్యగా మారిందని దుయ్యబట్టారు. ఫార్మర్ సొసైటీ కింద పేద దళితులకు 45 ఏళ్ల క్రితం ఇచ్చిన.. భూములపై వైసీపీ నేతలు వాలారని, చిత్తూరు జిల్లా చట్టేవారిపాలెంలో దళితుల భూములను.. వైసీపీ నేత ద్వారకానాథ్రెడ్డి కబ్జాకి యత్నించారని ఆరోపించారు. అడ్డుకున్న దళితుల్ని ట్రాక్టర్ పెట్టి తొక్కిస్తానన్నాడని నారా లోకేష్ తెలిపారు.
Updated Date - 2020-09-19T21:36:46+05:30 IST