రైతు సమస్యలపై స్పందించని జగన్: అఖిలప్రియ
ABN, First Publish Date - 2020-02-20T10:28:42+05:30
‘‘కర్నూలు జిల్లా పర్యటనలో సీఎం వైఎస్ జగన్ రైతు సమస్యలపై స్పందించలేదు. సాగు, తాగు నీటిపై స్పష్టత ఇవ్వలేదు. జిల్లా సమస్యలపై స్థానిక ఎమ్మెల్యేలు విన్నవించినా...
రుద్రవరం, ఫిబ్రవరి 19: ‘‘కర్నూలు జిల్లా పర్యటనలో సీఎం వైఎస్ జగన్ రైతు సమస్యలపై స్పందించలేదు. సాగు, తాగు నీటిపై స్పష్టత ఇవ్వలేదు. జిల్లా సమస్యలపై స్థానిక ఎమ్మెల్యేలు విన్నవించినా సీఎం జగన్మోహన్రెడ్డి పట్టించుకోక పోవడం దారుణం’’ అని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ విమర్శించారు. కర్నూలు జిల్లా తిప్పారెడ్డిపల్లెలో బుధవారం ఆమె మాట్లాడారు. అమరావతిలో రాజధాని తొలగిస్తే ఎక్కువ నష్టపోయేది రాయలసీమేనని చెప్పారు.
Updated Date - 2020-02-20T10:28:42+05:30 IST