కరోనాను జగన్ తక్కువ చేసి చూపే ప్రయత్నం చేశారు: పట్టాభి
ABN, First Publish Date - 2020-05-27T20:49:29+05:30
కరోనాను జగన్ తక్కువ చేసి చూపే ప్రయత్నం చేశారని టీడీపీ నేత పట్టాభి ఆక్షేపించారు. బ్లీచింగ్ పౌడర్, పారాసిట్మాల్ వేసుకుంటే సరిపోతుందన్నారని గుర్తుచేశారు. ప్రధానితో తమ అధినేత చంద్రబాబు
అమరావతి: కరోనాను జగన్ తక్కువ చేసి చూపే ప్రయత్నం చేశారని టీడీపీ నేత పట్టాభి ఆక్షేపించారు. బ్లీచింగ్ పౌడర్, పారాసిట్మాల్ వేసుకుంటే సరిపోతుందన్నారని గుర్తుచేశారు. ప్రధానితో తమ అధినేత చంద్రబాబు ఫోన్లో మాట్లాడారని తెలిపారు. రాజకీయాలు చేయడానికే జగన్కి సమయం సరిపోవట్లేదని, అంతర్జాతీయ పత్రికలన్నీ జగన్ విధానాలను ఎండగట్టాయని చెప్పారు. వలస కార్మికులను జగన్ ఏనాడూ పట్టించుకోలేదని, వలస కార్మికులపై లాఠీఛార్జ్ చేయించిన దుర్మార్గపు సీఎం జగన్ అంటూ మండిపడ్డారు. వైసీపీ ఎమ్మెల్యేల వల్లే రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగాయని, కరోనా నియంత్రణకు కేంద్రం ఇచ్చిన రూ.2500 కోట్లను దారి మళ్లించారని పట్టాభి ఆరోపించారు.
Updated Date - 2020-05-27T20:49:29+05:30 IST