వంగపండు ఇక లేరన్న వార్త ఎంతో బాధించింది: జగన్
ABN, First Publish Date - 2020-08-04T15:53:09+05:30
అమరావతి: వంగపండు మృతికి సీఎం జగన్ సంతాపం వ్యక్తం చేశారు. వంగపండు ఇక లేరన్న వార్త ఎంతో బాధించిందన్నారు.
అమరావతి: వంగపండు మృతికి సీఎం జగన్ సంతాపం వ్యక్తం చేశారు. వంగపండు ఇక లేరన్న వార్త ఎంతో బాధించిందన్నారు. ఆయన వ్యక్తిగతంగా తనకు చాలా ఆప్తులన్నారు. జానపదాన్ని తన బాణీగా మార్చుకుని ‘పామును పొడిచిన చీమలు’న్నాయంటూ ఉత్తరాంధ్ర ఉద్యమానికి అక్షర సేనాధిపతిగా మారారన్నారు. తెలుగువారి సాహిత్య, కళారంగాల చరిత్రలో ఓ మహాశిఖరంగా ఆయన నిలిచిపోతారని కొనియాడారు. వంగపండు కుటుంబానికి జగన్ ప్రగాఢ సంతాపం తెలియజేశారు.
Updated Date - 2020-08-04T15:53:09+05:30 IST