జగన్ రెడ్డి రౌడీ రాజ్యంలో ప్రజలకు రక్షణ లేదు: లోకేష్
ABN, First Publish Date - 2020-08-14T01:51:00+05:30
జగన్ రెడ్డి రౌడీ రాజ్యంలో ప్రజలకు రక్షణ లేదు: లోకేష్
గుంటూరు: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మాజీ మంత్రి నారా లోకేష్ విమర్శలు గుప్పించారు. జగన్ రెడ్డి రౌడీ రాజ్యంలో ప్రజలకు రక్షణ లేదని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డుకి అడ్డంగా గోడ కట్టడం చూశామని, ఇప్పుడు ఏకంగా ట్రాక్టర్ అడ్డుపెట్టి, మట్టి పోసి మూడు గ్రామాలకు రాకపోకలను వైసీపీ నేతలు బంద్ చేశారని విమర్శించారు. అనంతపురం జిల్లా, రాప్తాడు నియోజకవర్గం, చెన్నేకొత్తపల్లి గ్రామంలో భూవివాదంలో సహకరించలేదని గ్రామస్తులపై కక్షకట్టి అధికార పార్టీ నాయకులు ఉన్మాదంతో వ్యవహరిస్తున్నారని లోకేష్ విమర్శించారు . ఈ ఘటనపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని, వెంటనే గ్రామాలకు రాకపోకలు పునరుద్ధరించాలని లోకేష్ డిమాండ్ చేశారు.
Updated Date - 2020-08-14T01:51:00+05:30 IST