ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణకిషోర్ సస్పెన్షన్ రద్దు
ABN, First Publish Date - 2020-02-25T16:42:50+05:30
ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణకిషోర్ సస్పెన్షన్ రద్దు
అమరావతి: ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణకిషోర్ సస్పెన్షన్ను క్యాట్ రద్దు చేసింది. కృష్ణకిషోర్ తిరిగి కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు అనుమతినిస్తూ ట్రిబ్యునల్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కృష్ణకిషోర్పై కేసులను ప్రభుత్వం చట్టప్రకారం పరిశీలించుకోవచ్చని ఈ సందర్భంగా క్యాట్ పేర్కొంది.
గత ప్రభుత్వంలో ఏపీ ఆర్థిక అభివృద్ధి మండలి సీఈవోగా పనిచేసిన కృష్ణ కిషోర్పై అవినీతి ఆరోపణలు రావడంతో జగన్ ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా కృష్ణకిషోర్ సస్పెన్షన్ను రద్దు చేస్తూ క్యాట్ ఉత్తర్వులు జారీ చేసింది.
Updated Date - 2020-02-25T16:42:50+05:30 IST