ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్వాతంత్య్ర వేడుకలు విజయవాడలోనే..!

ABN, First Publish Date - 2020-08-07T12:11:45+05:30

స్వాతంత్య్ర వేడుకలు విజయవాడలోనే..!

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైకోర్టు తీర్పు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం 

అమరావతి(ఆంధ్రజ్యోతి): ఈ ఏడాది స్వాతంత్య్రదిన వేడుకలను విజయవాడలోనే నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. విశాఖపట్నంలో నిర్వహించాలని, క్యాంపు కార్యాలయం కూడా తరలించాలని ప్రభుత్వం తొలుత భావించినా... హైకోర్టు తీర్పు నేపథ్యంలో నిర్ణయం మార్చుకుంది. అమరావతి నుంచి సచివాలయం, క్యాంపు కార్యాలయాల తరలింపుపై ఆగస్టు 14వ తేదీ వరకూ యథాతథ స్థితిని కొనసాగించాలని హైకోర్టు ఉత్తర్వులిచ్చిన సంగతి తెలిసిందే. ఆ లోపు ప్రభుత్వం అఫిడవిట్‌ దాఖలు చేసేందుకు హైకోర్టు సమయం ఇచ్చింది. అనంతరం రాజధాని తరలింపు విషయంలో తుది విచారణ చేసి అంతిమ తీర్పు వెలువరించనుంది. ఈ నేపథ్యంలో స్వాతంత్య్రదిన వేడుకలను విజయవాడలోని ఎంజీఎం మైదానంలో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విజయవాడలో నిర్వహించే స్వాతంత్య్రదిన వేడుకలను కరోనా నిబంధనలు పాటిస్తూ ఘనంగా నిర్వహించేందుకు వీలుగా అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఆదేశించారు. 

Updated Date - 2020-08-07T12:11:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising