బడిలో బంధించారు
ABN, First Publish Date - 2020-04-19T09:26:13+05:30
బడిలో బంధించారు
రాజాం రూరల్, ఏప్రిల్ 18: గుంటూరు నుంచి శ్రీకాకుళం జిల్లాకు చేరుకున్న ఓ వ్యక్తిని గ్రామస్తులు పాఠశాల గదిలో బంధించారు. రాజాం మండలం కొఠారిపురం గ్రామానికి చెందిన కొమరాపు రాము.. పనుల కోసం గుంటూరు వెళ్లాడు. లాక్డౌన్ కారణంగా ప్రస్తుతం అక్కడ పనులు లేక లారీలో ప్రయాణించి చిలకపాలెం జంక్షన్లో శుక్రవారం రాత్రి 12గంటలకు దిగాడు. అక్కడినుంచి సుమారు 40కిలోమీటర్లు నడిచి రాజాం మీదుగా శనివారం ఉదయానికి కొఠారిపురం చేరుకున్నాడు. ఇది గమనించిన గ్రామస్తులు ముందుజాగ్రత్త చర్యగా అతడిని పాఠశాల గదిలో బంధించి పోలీస్, రెవెన్యూ, వైద్యసిబ్బందికి సమాచారం అందించారు.
Updated Date - 2020-04-19T09:26:13+05:30 IST