కరోనా లక్షణాలుంటే భయపడొద్దు.. అధికారులకు తెలపండి: హరీష్రావు
ABN, First Publish Date - 2020-03-27T14:57:14+05:30
సిద్దిపేట: కరోనా లక్షణాలుంటే భయపడాల్సిన అవసరం లేదని.. వెంటనే అధికారులకు, వైద్యులకు సమాచారం ఇవ్వాలని మంత్రి హరీష్రావు పేర్కొన్నారు.
సిద్దిపేట: కరోనా లక్షణాలుంటే భయపడాల్సిన అవసరం లేదని.. వెంటనే అధికారులకు, వైద్యులకు సమాచారం ఇవ్వాలని మంత్రి హరీష్రావు పేర్కొన్నారు. ప్రజలు తమ ఇళ్లలోనే ఉండి సహకరించాలని ఆయన కోరారు. చేయి దాటితే ఏమీ చేయలేమని.. ఓపికతో ఉండాలని సూచించారు. ప్రస్తుతానికి తెలంగాణ కంట్రోల్లోనే ఉందని.. అయినా అశ్రద్ధ, నిర్లక్ష్యం వద్దని హరీష్రావు సూచించారు. సీఎం కేసీఆర్ కరోనాపై ప్రతి నిమిషం మానిటరింగ్ చేస్తున్నారని.. ప్రభుత్వం ప్రజలకు అవసరమగు అన్ని చర్యలు తీసుకుంటుందని హరీష్రావు తెలిపారు.
Updated Date - 2020-03-27T14:57:14+05:30 IST