కేజీహెచ్కు వెళ్తే ఎన్టీఆర్ పదవి పోయింది
ABN, First Publish Date - 2020-05-09T10:24:18+05:30
‘ఎన్టీఆర్ 1995లో విశాఖలోని కింగ్జార్జి ఆస్పత్రి(కేజీహెచ్)కి వెళ్లారు. ఆయన పదవి పోయింది.
జగన్ ధైర్యం చేసి వెళ్లారు: పీవీపీ
విజయవాడ, మే 8: ‘ఎన్టీఆర్ 1995లో విశాఖలోని కింగ్జార్జి ఆస్పత్రి(కేజీహెచ్)కి వెళ్లారు. ఆయన పదవి పోయింది. ఆ భయంతో ఆ తర్వాత ఏ సీఎం అక్కడికి వెళ్లలేదు. 25 ఏళ్ల తర్వాత జగన్ ధైర్యం చేసి మళ్లీ కేజీహెచ్లో అడుగుపెట్టారు’ అని వైసీపీ నేత పొట్లూరి వరప్రసాద్(పీవీపీ) పేర్కొన్నారు. పదవి కన్నా ప్రజాసంక్షేమం ప్రధానంగా భావించి జగన్ కేజీహెచ్కి వెళ్లారని శుక్రవారం ట్విటర్లో పేర్కొన్నారు.
Updated Date - 2020-05-09T10:24:18+05:30 IST