ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బిర్యానీ కోసం హుండీనే బద్దలుగొట్టారు

ABN, First Publish Date - 2020-09-29T12:04:10+05:30

ఇద్దరు బాలలు బిర్యానీ తినాలనే ఆశతో డబ్బుల కోసం ఏకంగా దేవుని హుండీనే పగులగొట్టారు. పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల ఆంజనేయస్వామి గుడిలో జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు: ఇద్దరు బాలలు బిర్యానీ తినాలనే ఆశతో డబ్బుల కోసం ఏకంగా దేవుని హుండీనే పగులగొట్టారు. పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల ఆంజనేయస్వామి గుడిలో జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ నెల 26వ తేదీ అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు పలుగుతో గుడి తాళం పగులగొట్టి, అదే పలుగుతో హుండీని ధ్వంసం చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దొంగతనం చేసింది అదే మండలంలోని జగన్నాఽథపురానికి చెందిన ఇద్దరు బాలురుగా గుర్తించారు. వారిని విచారించగా బిర్యానీ తినాలనే కోరికతోనే హుండీ పగుల గొట్టి అందులో నుంచి రూ.140 తీసుకున్నామని చెప్పడంతో పోలీసులు అవాక్కయ్యారు. వారిని అరెస్ట్‌ చేసి కోర్టు ముందు సోమవారం హాజరు పర్చారు. ఈ సందర్భంగా ఏలూరులో జిల్లా ఎస్పీ నారాయణ నాయక్‌ విలేకరులతో మాట్లాడుతూ దేవాలయాలు, మసీదులు, చర్చిల్లో తరచూ నేరాలు జరుగుతూనే ఉంటాయని, కేసులు నమోదవుతుంటాయని తెలిపారు.

Updated Date - 2020-09-29T12:04:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising