ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విజయనగరం జిల్లాలో ఉద్రిక్తత

ABN, First Publish Date - 2020-12-30T16:57:19+05:30

ఏపీలో ఆలయాలపై వరుస దాడులు కలకలం రేపుతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయనగరం జిల్లా: ఏపీలో ఆలయాలపై వరుస దాడులు కలకలం రేపుతున్నాయి. తాజాగా రామతీర్థంలోని బోడికొండపై సుమారు 400 ఏళ్ల నాటి శ్రీరాముడి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేసి తల భాగాన్ని వేరుచేసి ఎత్తుకెళ్లారు. దీంతో విజయనగరం జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ ప్రభుత్వంలో హిందూ ఆలయాలకు రక్షణ లేకుండా పోతుందంటూ భక్తులు, విపక్షాలు మండిపడుతున్నాయి. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే రామతీర్థం ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయినట్లు సమాచారం. 


మంగళవారం ఉదయం గుడి పూజారి వెళ్లేసరికి ఆలయం తలుపులకు తాళం లేకపోవడంతో అధికారులకు సమాచారం అందించారు. వారిచ్చిన సమాచారంతో నెల్లిమర్ల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అందరూ కలిసి ఆలయం లోపల పరిశీలించగా శ్రీరాముడి విగ్రహం తల భాగం తెగి ఉండడాన్ని గుర్తించారు. తల భాగం కోసం పరిసరాల్లో వెదికినా కనిపించలేదు. దర్యాప్తు కోసం ప్రత్యేక పోలీస్ బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ రాజకుమారి తెలిపారు.

Updated Date - 2020-12-30T16:57:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising