నంద్యాలలో అబ్దుల్ సలాం దీక్షా శిబిరం వద్ద హైడ్రామా
ABN, First Publish Date - 2020-11-15T02:24:24+05:30
నంద్యాలలో అబ్దుల్ సలాం దీక్షా శిబిరం వద్ద హైడ్రామా నెలకొంది. శాంతి భద్రతల దృష్ట్యా దీక్ష ఆపాలని పోలీసులు కోరారు. అబ్దుల్ సలాం కుటుంబానికి న్యాయం
కర్నూలు: నంద్యాలలో అబ్దుల్ సలాం దీక్షా శిబిరం వద్ద హైడ్రామా నెలకొంది. శాంతి భద్రతల దృష్ట్యా దీక్ష ఆపాలని పోలీసులు కోరారు. అబ్దుల్ సలాం కుటుంబానికి న్యాయం చేస్తామని డీఎస్పీ చిదానందరెడ్డి హామీ ఇచ్చారు. దీంతో అబ్దుల్ సలాం న్యాయ పోరాట కమిటీ సభ్యులు దీక్ష విరమించారు. నిందితుల బెయిల్ రద్దు కాకపోతే కార్యాచరణ ప్రకటిస్తామని కమిటీ సభ్యులు తెలిపారు. అబ్దుల్ సలాం కేసును ప్రభుత్వం బలహీనపరిచేందుకు చూస్తోందని అబ్దుల్ సలాం న్యాయ పోరాట సమితి ఆరోపిస్తోంది. దోషులకు శిక్ష పడేంత వరకు తాము పోరాటం చేస్తామని కమిటీ సభ్యులు హెచ్చరిస్తున్నారు.
అబ్దుల్ సలాం (45).. భార్య నూర్జహాన్ (38), కుమార్తె సల్మా (14), కుమారుడు దాదా ఖలందర్ (10)తో కలిసి పాణ్యం మండలం కౌలూరు వద్ద గూడ్స్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. బంగారు షాపులో చోరీ, ఆటోలో దొంగతనం వంటి కేసుల్లో పోలీసులు అబ్దుల్ సలాంను వేధించినట్లు అప్పట్లోనే ఆయన బంధువులు ఆరోపించారు. ఈ క్రమంలోనే.. ఆత్మహత్యకు ముందు అబ్దుల్ సలాం కన్నీటి పర్యంతమవుతూ రికార్డు చేసిన సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చింది.
Updated Date - 2020-11-15T02:24:24+05:30 IST